TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో డీలక్స్ బస్సులు, ఈ-మెట్రో AC సర్వీసుల్లో టికెట్ ధరలను తగ్గిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. మార్చి 1 నుంచి మే ఆఖరు వరకు తగ్గింపు ధరలు అమల్లో ఉండనున్నాయి. మెట్రో డీలక్స్ బస్సులో గతంలో 4 కి.మీల ప్రయాణానికి రూ.30 ఛార్జీ ఉండగా.. ప్రస్తుతం రూ.25కి తగ్గింది. అదే దూరానికి ఈ-మెట్రో AC సర్వీసులో గతంలో రూ.35 ఉండగా రూ.25కి తగ్గించారు.