TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో గొడవపడి స్నేహితుడు మధును రాడ్డుతో కొట్టి చంపిన చరణ్, నవీన్.. మృతదేహాన్ని ఇసుక దిబ్బలో పాతిపెట్టారు. విషయం తెలుసుకున్న చరణ్ తల్లి, కొడుకు అని చూడకుండా పోలీసులకు పట్టించి నిజాయితీ చాటుకుంది. పోలీసులు చరణ్ను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు నవీన్ కోసం గాలిస్తున్నారు. కొడుకు హంతకుడిగా మారడంతో తల్లి విలపిస్తోంది.