TG: పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మెదక్ జిల్లా కొత్తపల్లి తండాకు చెందిన బానోత్ సాయిప్రియ(16) ఇటీవల జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసింది. అయితే, ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.