PDPL: పెద్దపల్లి మదర్ థెరిసా కాలేజీలో నిర్వహించిన 5 రోజుల శిక్షణా కార్యక్రమం అనంతరం గ్రామ సర్పంచ్లకు ప్రశంసా పత్రం అందజేశారు. జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ఎంపీవో షబ్బీర్ చేతుల మీదుగా మంథని(M) గుంజపడుగుకి చెందిన దండవేన సంధ్యకి సర్టిఫికెట్ ప్రదానం చేశారు. పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై శిక్షణ పొందిన సర్పంచ్లకి అధికారులు అభినందనలు తెలిపారు.