KMR: ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదర్శ కళాశాల పరీక్ష కేంద్రాల్లో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సర (సెట్ “బీ”) తెలుగు, హిందీ, ఉర్దూ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 246 మందికి 243 మంది, ఆదర్శ కళాశాల కేంద్రంలో 219 మందికి 208 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందన్నారు.