UP మీర్జాపూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది సజీవ దహనమయ్యారు. డ్రమండ్గంజ్ ప్రాంతంలో కంకర లోడు లారీ వేగంగా వచ్చి మారుతీ స్విఫ్ట్ను ఢీకొనగా.. అది దాని ముందున్న బొలెరోను గుద్దడంతో మంటలు చేలరేగాయి. దీంతో 11 మంది అక్కడికక్కడే మంటల్లో ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.