HNK: కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాపరెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంను డిసబుల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. పార్ట్ టైమ్ అధ్యాపకుల నియామకాలలో దివ్యాంగుల రోస్టర్ పాయింట్ల ఇంటర్ చేంజ్ విధానం అమలు చేయాలని వీసీని వారు కోరారు. జాతీయ అధ్యక్షుడు మహమ్మద్ యాకుబ్ పాషా, రాంబాబు, శ్రీశైలం, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.