NTR: గంపలగూడెం(M) మేడూరు ఆంజనేయస్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొవాలని జనసేన నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని సమన్వయకర్త శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు వెంకట కృష్ణారావు కోరారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీర మహిళా నాయకులు పాల్గొన్నారు.