‘ఆపరేషన్ కగార్’ నేపథ్యంలో మావోయిస్టు కీలక నేతలు లొంగిపోతున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతికి ఆయన సోదరుడు రామచంద్రరావు కీలక విజ్ఞప్తి చేశారు. వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోరారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. గణపతితో పనిచేసిన అందరూ లొంగిపోయారని వెల్లడించారు. గణపతిపై 12 రాష్ట్రాల్లో ఉన్న కేసులను ఎత్తివేయాలని కోరారు.