NLG: నార్కట్ పల్లి మండలం, గోపలాయపల్లి గుట్టపై శ్రీ వారిజాల వేణు గోపాలస్వామి ఆలయంలో బుధవారం సుదర్శన హోమాన్ని వేద పండితులు వైభవంగా నిర్వహించారు. ప్రతి నెల రోహిణి నక్షత్రం సందర్భంగా గుట్టపై హోమాన్ని నిర్వహిస్తారు. పలువురు దంపతులు సాంప్రదాయ దుస్తులు ధరించి హోమంలో పాల్గొన్నారు. భక్తులు విచ్చేసి హోమాన్ని తిలకించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరిపారు.