KRNL:పెద్దకడబూరులో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు DSP భార్గవి తెలిపారు. నిందితుల వారి వద్ద నుంచి సుమారు 15 తులాల బంగారం, 65 తులాల వెండి ఆభరణాలు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 28న హనుమపురంలో ఓఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలు దొంగలించిన ఘటనపై కేసులో పోలీసులు, టెక్నికల్ ఆధారాలతో నిందితులను గుర్తించామన్నారు.