W.G. నరసాపురం మాజీ ఎమ్మెల్యే, పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదు రాజుని నరసాపురంలో బుధవారం మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు కలిశారు. తాజాగా మేక శేషుబాబుపై సస్పెన్షన్ను ఎత్తివేస్తూ పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు.