AP: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటావానిపల్లెకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ఆధునికీకరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అధికారులతో కలిసి కెనాల్ వెంట నడిచి పరిశీలించారు. పనుల నాణ్యత తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.