NLG: ఎర్రబెల్లిలో వెలిసిన శ్రీ మాణిక్యాలదేవి సమేత లింగమంతుల స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా రేపు వివిధ విక్రయాలకు సంబంధించి బహిరంగ వేలం నిర్వహించనున్నారు. మార్చి 7 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న ఈ జాతరలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసే స్టాళ్లకు ఈ వేలం ఉంటుందని దేవస్థాన కమిటీ ఛైర్మన్ మన్నెం వెంకన్న తెలిపారు.