కృష్ణా: మచిలీపట్నం రేవతి సెంటర్లో గల అగ్నిమాపక కేంద్రాన్ని కలెక్టర్ బాలాజీ సందర్శించి, నిన్నటి నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించుటకు ప్రజలను చైతన్య పరచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.