ATP: రాప్తాడు నియోజకవర్గ YCP సోషల్ మీడియా కార్యకర్త గిరీష్ రెడ్డిని కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. రాప్తాడులో ఆయనను అదుపులోకి తీసుకుని కుప్పానికి తరలించినట్లు సమాచారం. గిరీష్ రెడ్డిపై కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. అయితే, ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.