సత్యసాయి జిల్లాలోని పలు ఆర్టీసీ బస్టాండ్లలో ఖాళీగా ఉన్న దుకాణాలను టెండర్ ద్వారా కేటాయించనున్నారు. ఆసక్తి గల వ్యాపారస్తులు రేపు ఆయా డిపోలకు వెళ్లి టెండర్ ఫారాలను తీసుకోవచ్చు. టెండర్ దరఖాస్తులు సమర్పించడానికి కూడా రేపే చివరి రోజు అని అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన బస్టాండ్లలోని ఖాళీ గదులు నుంచి స్టాళ్ల వరకు ఈ వేలంలో పాల్గొనవచ్చు.