AP: కల్తీనెయ్యిలో ఏ రసాయనాలు వాడారో ఆ పెరుమాళ్లకే తెలియాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘జంతు సంబంధ రసాయనాలు ఉన్నాయని NDDB రిపోర్టు చెప్పింది. ఆ నెయ్యి నెయ్యే కాదని CBI రిపోర్టు ఇచ్చింది. ఇది ధర్మానికి సంబంధించిన విషయం. టీటీడీ పాత బోర్డును జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారు? కల్తీ నెయ్యి కేసులో దోషులు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే’ అని పవన్ వెల్లడించారు.