ATP: మంగళగిరిలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్లస్టర్ ఇంఛార్జ్ల శిక్షణా తరగతుల్లో జిల్లా సీనియర్ నేత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు పాల్గొన్నారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన విధివిధానాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. క్లస్టర్ ఇంఛార్జ్లు ఎప్పటికప్పుడు గ్రామ, మండల కమిటీలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.