E.G: రాజమండ్రి నుంచి కాశీ, అయోధ్య పుణ్య క్షేత్రాల సందర్శనకు ఏప్రిల్ 19 నుంచి సూపర్ లగ్జరీ బస్సు సర్వీసు ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ మాధవ్ గురువారం తెలిపారు. 11 రోజుల పాటు సాగే ఈ యాత్రలో భువనేశ్వర్, పూరి, కోణార్క్, అయోధ్య, బుద్ధగయ, అరసవెల్లి శ్రీ కుర్మం, అన్నవరం సహా 13 ఆలయాలను సందర్శించవచ్చు. టికెట్ ధర రూ.13,000గా నిర్ణయించినట్లు వెల్లడించారు.