NRML: పెంబి మండలం పుల్గం పాండ్రికి చెందిన లావుడ్య రమేష్ కుమార్తె హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో కిడ్నీ సంబంధిత చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆమెను పరామర్శించారు. ఈ మేరకు ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు.