ASF: పెంచికల్ పేట్ మండలం ఎల్లూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు అమర్చిన విద్యుత్ తీగలకు నీలుగాయి మృతి చెందినట్లు FRO అనిల్ కుమార్ తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా SI అనిల్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వెటర్నరీ డాక్టర్ రాకేశ్ శవ పంచనామ నిర్వహించారు. అనంతరం ఖననం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.