ATP: కూడేరు మండలం ముద్దలపురం వద్ద 16 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి కేంద్రాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభించారు. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో MP అంబికా లక్ష్మీనారాయణ, MLA దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.