KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి. సాయంత్రం 7 గంటలకు ధ్వజావరోహణ కార్యక్రమం నిర్వహించి గరుడ పటాన్ని అవతనం చేశారు.బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులు పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధి పొందుతారని ఐతిహ్యం. సకల శ్రేయస్సులు కలుగుతాయని విశ్వాసం.