నెల్లూరు జిల్లా కావలికి చెందిన 80 ఏళ్ల ‘పరుగుల బామ్మ’ రామసుబ్బమ్మను మాజీ మున్సిపల్ ఛైర్మన్ ప్రభాకర్ నాయుడు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ వయసులో రన్నింగ్, షాట్పుట్, జావెలెన్ త్రోలో ఆమె అనేక పథకాలు సాధించి కావలికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారని వారు కొనియాడారు.