CTR: చిత్తూరు జిల్లా ప్రజలు ఆన్లైన్ ఆర్థిక మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ తుషార్ డూడి సూచించారు. ఫేక్ లింకులు, QR కోడ్లు, OTP మోసాల ద్వారా డబ్బులు దోచుకుంటున్నారని హెచ్చరించారు. OTP, PIN వివరాలు పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని తెలిపారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.