ATP: టీటీడీ చైర్మన్ పదవి నుంచి బిఆర్ నాయుడుని తొలగించాలని వైసిపి జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం గుంతకల్లులోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. నైరుతి రెడ్డి మాట్లాడుతూ.. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.