AKP: తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ జిల్లాలో ఇవాళ అన్ని ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం మాట్లాడుతూ.. ఆలయ ఛైర్మన్ బీఆర్ నాయుడుని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అన్ని నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.