JGL: జగిత్యాల పట్టణంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు కీలకమని అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల పునరుద్ధరణకు సుమారు రూ. 500 కోట్లు సరిపోతాయని తెలిపారు. ప్రాణహిత జలాల వినియోగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు.