TPT: రేణిగుంట పట్టణంలోని ఓల్డ్ చెక్పోస్ట్ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సన్రైజ్ హాస్పిటల్స్ను తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రారంభించారు. ఆధునిక సదుపాయాలతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. తక్కువ ఖర్చుతో సేవలు అందించి పేదలకు తోడ్పడాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు.