KRNL: ఎమ్మిగనూరు 25వ వార్డులో ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పర్యటించారు. టీడీపీ ఇన్ఛార్జ్ ఉప్పర రవి కుమార్ ఆధ్వర్యంలో ఇవాళ స్థానికులు తాగునీటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సమస్యను త్వరగా పరిష్కరించాలన్ని పేర్కొన్నారు.