PLD: సత్తెనపల్లిలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. గృహ, పెన్షన్, వైద్య సమస్యలను ప్రజలు ఆయనకు విన్నవించారు. గత ప్రభుత్వంలా కాకుండా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. సమస్యల సత్వర పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.