KDP: చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 25 రోజుల పసికందును కన్నతండ్రే రూ.50 వేలకు అమ్మడం, దానికి సిబ్బంది మధ్యవర్తులుగా ఉండటం దారుణమని BJP మండల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. భరోసా కల్పించాల్సిన వైద్యులే ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఇలాగైతే ప్రజలు ఆసుపత్రులకు వెళ్లాలంటేనే భయపడతారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కేసులు నమోదు చేయాలన్నారు.