ATP: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డికి చెందిన రాక్రీట్ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ శివారు జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి లేకుండానే తప్పుడు బిల్లులతో నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కలెక్టర్ లక్ష్మీశ ఆదేశాల మేరకు గృహనిర్మాణ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.