KDP: ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ అంకాలమ్మ అమ్మవారి తిరుణాళ్లు ఇవాళ్టి నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. ఈ తిరుణాళ్లు బియ్యం కొలతతో ప్రారంభం కాగా శనివారం బోనాల కార్యక్రమం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం పరిసర గ్రామాలలో విందు కార్యక్రమం జరగనుందన్నారు. ఈ సందర్భంగా అంకాలమ్మ అమ్మవారిని విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దారు.