SRCL: ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వీర్నపల్లి ఎస్సై వేముల లక్ష్మణ్ సూచించారు. వీర్నపల్లి మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. హెల్మెట్ ధరించడం కేవలం ట్రాఫిక్ నిబంధన మాత్రమే కాదని, అది మీ ప్రాణాలకు భరోసా అని పేర్కొన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు.