ASF: సిర్పూర్ (టి) మండలంలో పోలీసులు గురువారం రాత్రి నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం, అక్రమంగా తరలిస్తున్న బియ్యం స్వాధీనం చేసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు మండల కేంద్రంలోని దుర్గ భవాని రైస్ మిల్లుపై పోలీసులు దాడి చేశారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 9 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశారు.