AKP: పాయకరావుపేట పట్టణంలో మెయిన్ రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యత లోపిస్తున్నట్లు వైసీపీ పట్టణ అధ్యక్షుడు ధనిశెట్టి బాబి, పార్టీ నాయకులు ఆరోపించారు. గురువారం రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రహదారి విస్తరణకు తాము వ్యతిరేకం కాదన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారన్నారు.