AP: పల్నాడు జిల్లా మాచర్లలో పరువు హత్య కలకలం రేపింది. నాగరాజు అనే వ్యక్తిని ప్రేమించి, గత నెలలో ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్న చౌడేశ్వరిని ఆమె తండ్రే దారుణంగా చంపాడు. సర్దిచెబుదామని ఇంటికి పిలిపించగా.. భర్తతోనే ఉంటానని ఆమె తెగేసి చెప్పింది. దీంతో ఆగ్రహం చెందిన తండ్రి, పరువు పోయిందన్న కోపంతో కన్నకూతురిని అంతమొందించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.