ADB: ఇంద్రవెల్లి మండలానికి చెందిన హీర కుమ్ముర అనిల్ కుమార్ 25వ సారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. దొడందా వాడ్ గామ్కు చెందిన రోగికి అత్యవసరంగా ఓ-పాజిటివ్ రక్తం అవసరమని తెలిసిన వెంటనే స్పందించి, ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో రక్తదానం చేశారు. దీంతో ఆయన సేవలను పలువురు కృతజ్ఞతతో అభినందించారు.