కామారెడ్డి జిల్లాలో యువత భారత సైన్యంలో చేరడానికి మరో 10 రోజులు దరఖాస్తు గడువు పొడిగించామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మొదటగా దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ ఒకటి వరకు ఉండగా, అభ్యర్థులకు మరింత అవకాశం కల్పించేందుకు ఈనెల 11వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు చెప్పారు.