VKB: కుల్కచర్లలో వెలిసిన కాళికాదేవి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది. నిన్న రాత్రి ఆలయంలో అఖండ భజన నిర్వహించారు. దైవచింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని హైందవ ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.