NDL: జూపాడుబంగ్లా మండలం తత్తూరులో గల శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి తిరుణాళ్లకు సర్వం సిద్ధం చేశారు. రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 26 నుంచి ప్రారంభమై ఈ నెల 4 వరకు వసంతోత్సవం తీర్థావళితో ముగియనున్నాయి. 2న స్వామి వారి రథోత్సవం కన్నుల పండుగగా జరుపుకోవడం ఇక్కడ విశిష్టత. జాతరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని నలమూల ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.