MLG: ఏటూరునాగారం ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే లక్ష్యమని సీఐ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ముళ్లకట్ట గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ప్రాధాన్యత, భద్రతలో వాటి ఉపయోగాలను గ్రామస్థులకు వివరించారు. ఇకపై ప్రతిరోజూ ఒక గ్రామంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.