అనకాపల్లి శారదానదిపై వినాయక ఘాట్ వద్ద కాలుష్యాన్ని నివారించేందుకు ఐరన్ డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలని వినాయక నిమజ్జనోత్సవ కమిటీ అధ్యక్షుడు ఆడారి కుమారస్వామి, ప్రతినిధులు బుధవారం జోనల్ కమిషనర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నది కాలుష్యం పెరుగుతోందని, డస్ట్ బిన్లు ఏర్పాటు చేస్తే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని వివరించారు.