ASF: ఏప్రిల్ 2న జరగనున్న హనుమాన్ జయంతి వేడుకల దృష్ట్యా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ నితిక పంత్, IPS పటిష్ట బందోబస్తుకు ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచామని, డయల్ 100 కాల్స్ పై సిబ్బంది తక్షణమే స్పందించాలని సూచించారు.