PDPL: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సత్వర వైద్య సేవలు అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. వైద్యులు పూర్తి పని గంటల్లో అందుబాటులో ఉండాలని, ఓపీ టోకెన్లు, ల్యాబ్ ఫలితాలు రోగులకు సకాలంలో అందేలా చూడాలని సూచించారు. ఆసుపత్రిలో దిశా సూచికలు ఏర్పాటు చేయాలని, ప్రతి విభాగం సేవల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.