మేడ్చల్: ఇంటి నుంచి బయటకు వెళ్ళిన కారు డ్రైవర్ అదృశ్యమైన ఘటన జవహర్ నగర్ పీఎస్ పరిధి హకీంపేటలో ఆదివారం చోటుచేసుకుంది. హకీంపేటలో నివసించే సాయిరాం(23) కారు డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ నెల 15న పని ఉందని ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళి తిరిగిరాలేదు. ఈ మేరకు కుటుంబ సభ్యులు పీఎస్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
NZB: నిజామాబాద్లోని బైపాస్ రోడ్డులో ఆదివారం ఉదయం కారు సైకిల్ను ఢీకొన్న ఘటన తెలిసిందే.. ఈ ఘటనలో సైకిల్ నడుపుతున్న చంద్రశేఖర్ కాలనీకి చెందిన సయ్యద్ షాహిజాద్ (11) తీవ్ర గాయాలు కాగా స్థానికులు చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో బాలుడు చికిత్స పొందుతున్నాడు. కాగా, ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్ను కరీంనగర్ సీపీ గౌస్ ఆలం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం ఇరువురు జిల్లాలోని శాంతి భద్రతలకు సంబంధించి పలు అంశాలపై ముచ్చటించుకున్నారు.
SDPT: గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి దినేశ్ మొదటి ప్రయత్నంలోనే గ్రూప్-3లో మెరిశాడు. కాగా దినేశ్ తండ్రి 2020లో అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తర్వాత మూడు నెలలకే తల్లి రోడ్డు ప్రమాదంలో గాయాపడ్డి కోమాలోకి వెళ్లి మంచానికే పరిమితమైంది. అయినప్పటికీ కష్టపడి దినేశ్ కేవలం ఆన్లైన్ క్లాసులు మాత్రమే వింటూ.. అమ్మను చూసుకుంటూ గ్రూప్-3లో 80వ ర్యాంకు సాధించాడు.
NGKL: లింగాల మండలానికి చెందిన సామజిక వేత్త డాక్టర్ నూకల శంకర్ బాబు హైదరాబాద్లో మయూరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో అందించే ప్రతిష్ఠాత్మకంగా ఉగాది పురస్కారం అవార్డును శనివారం పలువురు సీరియల్ నటుల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సమాజానికి తమ వంతుగా సేవ చేయాలని కోరారు.
MDK: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ను అవమాన పరిచే విధంగా మాట్లాడినందుకు నిరసనగా బీఆర్ఎస్ నాయకుల దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రామాయంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన రామాయంపేటలో మాట్లాడుతూ.. ఆదివారం ప్రతి మండల, గ్రామాల్లో నిరసన కార్యక్రమం చేపట్టాలని పేర్కొన్నారు.
SRPT: శాసనసభ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సీపీఎం పార్టీ జిల్లా నాయకులు వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెం గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సర్వే నిర్వహించి మాట్లాడారు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రుద్రంపూర్ గ్రామానికి చెందిన యువకుడు మొహమ్మద్ హఫ్రీద్ ఒకే సంవత్సరంలో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించాడు. టీజీపీఎస్సీ, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, సింగరేణి, జూనియర్ లెక్చరర్ పోటీ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, 5 ఉద్యోగాలు సాధించాడు.
NGKL: భద్రాచలం శ్రీ రాముని ముత్యాల తలంబ్రాలు తపాల ద్వారా అందిస్తున్నట్లు జిల్లా తపాల అధికారి సృజన్ నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు రూ.150 ముత్యాల తలంబ్రాలు, రూ. 450 చెల్లిస్తే భక్తులకు గోత్రనామాలతో పసుపు, కుంకుమ, ముత్యాల తలంబ్రాలు ఇంటి వద్దకు అందజేస్తామని అన్నారు. నగదును స్థానిక పోస్ట్ ఆఫీస్లో చెల్లించాలన్నారు.
BDK: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం జిల్లా సమీకృత కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు స్వచ్ఛందంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని సూచించారు.
BDK: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ఈనెల 17, 18వ తేదీల్లో చండ్రుగొండ, అశ్వరావుపేట మండలాల్లో పర్యటిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చండ్రుగొండ మండలం సీతాయిగూడెం ప్రాజెక్టు సందర్శించిన, అనంతరం గ్రామంలోని గిరిజనులకు సంబంధించిన పోడు పట్టా భూములను పరిశీలించి గిరిజన రైతులతో సమావేశం అవుతారన్నారు.
SRPT: కోదాడలో రేపటి నుంచి మూడు రోజులపాటు జరిగే పెన్షనర్ల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను పెన్షనర్లు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య కోరారు. శనివారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డితో కలిసి వారు మాట్లాడారు.
NLG: దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో మునిసిపల్ కమిషనర్ వై. సుదర్శన్ అధ్యక్షతన అన్ని విభాగాల అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్తి పన్నులు, నీటి కులాయిల బిల్లులు, వాణిజ్య లైసెన్స్ ఫీజులు వసూలు చేయాలని ఆదేశించారు. ప్రజలు కూడా సహకరించి బిల్లులు చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని పట్టణ ప్రజలను కోరారు.
KMM: విద్యార్థులంతా ఆత్మ విశ్వాసంతో అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం కొణిజర్ల (మం) పెద్దమునగాల ZPHS పాఠశాలలో వుయ్ కెన్ లెర్న్ ఇంగ్లీష్ కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. పిల్లలకు మంచి విద్య అందించడమే ప్రభుత్వం యొక్క అత్యంత ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు.
NGKL: వేసవికాలం తీవ్రత దృష్ట్యా విధుల్లోఉన్న డ్రైవర్లు, కండక్టర్లకు మార్చి15 నుంచి మజ్జిగ పంపిణీ చేయాలని ఆర్టీసీMD సజ్జనార్ ఆదేశించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ ఆర్టీసీ బస్టాండ్లో శనివారం డిపో మేనేజర్ యాదయ్య విధుల్లో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. జేఆర్ రెడ్డి, పిఎస్ రావు, జయప్రకాష్, నారాయణ, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.