KMM: ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో భూసర్వే నిర్వహించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్టు కింద 5 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి భూ సర్వే పూర్తి చేశామని, రాబోయే రోజుల్లో 32 జిల్లాల్లో ప్రతి జిల్లాకు 70 గ్రామాలను గుర్తించామని అన్నారు.