BHNG: పంతంగి టోల్ ప్రజా వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని రాచకొండ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీ మల్లారెడ్డి తెలిపారు. శనివారం పంతంగి టోల్ ప్లాజాను పరిశీలించి మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడకి వెళ్లే వాహనదారులు పెద్ద ఎత్తున వెళ్తుండడంతో 10 టోల్ బూతులను ఏర్పాటు చేసి ట్రాఫిక్ను నియంత్రిస్తున్నామని తెలిపారు.
NLG: నకిరేకల్ నియోజకవర్గ కేంద్రం నుంచి శనివారం హైదరాబాద్లో నిర్వహించే మేధావుల సంఘీభావ సభకు నకిరేకల్ డివిజన్ మాదిగ ఉద్యోగుల సమైక్య నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బొజ్జ వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటనారాయణ మాట్లాడుతూ.. SC వర్గీకరణను చేపట్టే వరకు పోరాటం చేస్తామన్నారు.
KMRD: వర్ని మండలంలో ఆదివారం జరగనున్న బడాపహాడ్ ఉర్సు ఉత్సవాలకు ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారని మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ జుబేర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడలోని బీఆర్ఎస్ కార్యాలయానిక మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారని ఆయన తెలిపారు. కార్యకర్తలు, నాయకులు సకాలంలో చేరుకోవాలని ఆయన కోరారు.
NLG: బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలకు అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ భరోసా ఇచ్చారు. నేరడుగొమ్ము మండలం పేర్వాల గ్రామానికి చెందిన గాదం నారయ్య బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వాన్ని పొందారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మంజూరైన రూ.2లక్షల చెక్కును శనివారం నారయ్య కుటుంబానికి అందజేశారు.
NLG: మూసీ ప్రాజెక్ట్ ఎగువ నుంచి 37.73 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 641.08 అడుగులుగా ఉంది. మూసీ ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.45 టీఎంసీల నీరు నిలువ ఉన్నట్లు ప్రాజెక్ట్ అధికారి మధు తెలిపారు.
HYD: కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ఆదివాసీ గూడేలు ఆగమయ్యాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అనేక సమస్యల మధ్య ఆదివాసీలు జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం హామీలు ఇవ్వడం, ప్రకటనలు చేయడానికి మాత్రమే పరిమితం కాకుండా తక్షణమే సమస్యలను పరిష్కరించడానికి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పనిచేయాలని డిమాండ్ చేశారు.
HYD: పురానాపూల్ డివిజన్ పరిధిలో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బంది యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టారు. దీంట్లో భాగంగా డివిజన్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దోమల నివారణ మందు పిచికారి చేశారు. పూలకుండీలు, ఇతర పాత్రలో నిల్వ ఉన్న నీటిని క్లియర్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మురికినీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు.
HYD: GHMC వ్యాప్తంగా అధికారులు సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ధి పనులు చేపట్టారు. దీంట్లో భాగంగా ఖైరతాబాద్ పరిధిలోని సంత్ నిరంకారీ భవన్ జంక్షన్ వద్ద సుందరీకరణ పనులు పూర్తి చేశారు. తాజాగా ఫౌంటెన్ కూడా ఏర్పాటు చేయడంతో స్థానిక పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి. చూపరులను ఆకర్షిస్తుంది. దీంతోపాటు ట్రాఫిక్ సమస్య కూడా కొంతమేర తగ్గిందని స్థానికులు, వాహనదారులు తెలిపారు.
HYD: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో కూనంనేని మీడియాతో మాట్లాడారు. ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం పేదలకు చెందిన లక్షల దరఖాస్తులు ఏండ్ల తరబడి పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. పేదల ఆశలన్నీ ఎల్ఆర్ఎస్ పైనే ఉన్నాయని వెంటనే పరిష్కరించాలని కోరారు.
BHNG: భూధాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువతులకు బేసిక్ బ్యూటీషియన్, అడ్వాన్స్ బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నామని ఆ సంస్థ డైరెక్టర్ పిఎస్ఎస్ఆర్ లక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండి పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె కోరారు.
NLG: నేడు నాగార్జునసాగర్కు Dy.Cm భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి రానున్నారు. వారు Hyd నుంచి హెలికాప్టర్లో 10:15కు సాగర్ చేరుకుంటారు. సాగర్లోని ప్రాజెక్ట్ హౌస్ అతిథి గృహంలో నిర్వహిస్తున్న ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఫర్ ఆదివాసి కార్యక్రమంలో మాట్లాడుతారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 రాష్ట్రాల మాజీ మంత్రులు, MLAలు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు.
SRD: రామచంద్రాపురం మండలం ఎంఐజీ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్కో ఏఈ శివశంకర్ పేర్కొన్నారు. విద్యుత్ నగర్ ఎంఐజీ, అన్నమయ్య ఎంక్లేవ్, పాత ఎంఐజీ, మ్యాక్స్ సొసైటీ, ఇంద్రానగర్, ఏబీ కాలనీ, తెల్లాపూర్ గ్రామ పరిసరాలలో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.
NLG: దేవరకొండ మండలం భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి రూ.12 వేలు, ఎలాంటి కొర్రీలు లేకుండా ఉపాధి హామీకార్డు ఉన్నవారికి సంవత్సరానికి రూ.12 వేలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ అన్నారు. శుక్రవారం పట్టణంలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంగలయ్య, బారీములు, హుస్సేన్, ఆంజనేయులు, బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.
NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తిలో కోతులు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన దివ్యాంగుడు కొత్తసాయి యాదవ్ ఇంటిపై కప్పును కూలగొట్టి భారీ నష్టాన్ని మిగిల్చాయి. కోతుల దాడితో ఇంట్లో ఉన్న మహిళ భయభ్రాంతులకు గురయ్యారు. అధికారులు కోతుల నివారణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
BHNG: తురపల్లి మండలం మదపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుక్రవారం శంకుస్థాపన చేశారు. గ్రామంలోని సీసీ రోడ్డు అండర్ డ్రైనేజ్ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమిరిశెట్టి నరసింహులు, మాజీ వైస్ ఎంపీపీ మహాదేవుని శ్రీనివాస్, ఎంపీడీవో ఝాన్సీ లక్ష్మీబాయి పాల్గొన్నారు.